తిరుమల : కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. నిన్న 66,577 మంది భక్తులు దర్శించుకోగా 31,471 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3. 97 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. భక్తులు తమ ఆరోగ్యం, అదేవిధంగా టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాలని కోరారు.