అమరావతి: తిరుమలలో శ్రీవారు భక్తులకు కనువిందు దర్శనం ఇస్తున్నారు. నిన్న శ్రీవారిని 65,704 మంది భక్తులు దర్శించుకోగా 33,187 మంది తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా ఆలయానికి హుండీ ద్వారా 3.67 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు అందరూ తప్పనిసరిగా దర్శన టిక్కెట్లు కలిగివుండి అలిపిరి తనిఖీ కేంద్రం , నడకదారి వద్ద నిఘా, భద్రతా సిబ్బందికి చూపించి తిరుమలకు రావాలని వివరించారు.
శ్రీవారి భక్తులు అందరూ తప్పని సరిగా కొవిడ్ నియమ నిబంధనల్లో భాగంగా మాస్కు ధరించాలని సూచించారు. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి ఉదయం 3 గంటలు నుంచి రాత్రి 12 గంటల వరకు వాహనాల అనుమతి లేదని వివరించారు. ద్విచక్రవాహనాలను ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఇస్తామన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా నిషేదించబడ్డాయని, కనుక భక్తులు ఎవరూ తమ వెంట ప్లాస్టిక్ వస్తువులను తీసుకొని రావద్దని సూచించారు.