తిరుమల : తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు 31. 967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.43 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా 11,233 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కరోనా మహమ్మారి కారణంగా భక్తులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఒమిక్రాన్ సైతం రాష్ట్రంలో పెరుగుతున్న దశలో అలిపిరి వద్ద భక్తులను తనిఖీ చేస్తున్నారు. తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్న వారి దృవ ప్రతాలను పరిశీలించి కొండపైకి అనుమతి ఇస్తున్నారు.