శ్రీశైలం: శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు భక్తులు మొక్కులు, కానుకల రూపంలో గత 18 రోజులుగా 2,79,34,370 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. బుధవారం ఉదయం నుండి ఆలయ ప్రాకారంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉభయ దేవాలయాల హుండీలతోపాటు పరివార దేవతాలయాల హుండీలను అధికారుల సమక్షంలో శివసేవకులు మరియు సిబ్బందితో లెక్కింపజేశారు.
వీటితోపాటు 163 గ్రాముల 900 మిల్లిగ్రాముల బంగారం, 5 కేజీల 150 గ్రాముల వెండి మరియు 435 యుఎన్ఏ డాలర్లు, 20 కెనడా డాలర్లు, 40 యూఏఈ దిర్హమ్స్, 45 ఆస్ట్రేలియా డాలర్లు, 45 ఇంగ్లాండ్ పౌండ్స్, 5 ఒమన్ రియాల్స్ తదితర వీదేశీ కరెన్సీని కూడా భక్తులు మొక్కులుగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈవోతోపాటు ఈఈ మురళీ బాలకృష్ణ, ఏసి నటరాజ్, భద్రతా అధికారి నర్సింహరెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకుడు అనిల్ కుమార్లతో పాటు అధికారులు పాల్గొన్నారు.