Srisailam | కృష్ణానది ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శనివారం జూరాల ప్రాజెక్టు నుండి 1,45,592, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 26,832, సుంకేశుల నుండి 89,408 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదల అయింది. దీంతో శనివారం సాయంత్రం వరకు 3,47,018 క్యూసెక్కుల ఇన్ఫ్లో రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తు తెరిచి 3,76,160, కుడి ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 62,484 క్యూసెక్కుల వరద నీటిని దిగువన నాగార్జున సాగర్కు విడుదల చేశారు. రిజర్వాయర్ ప్రస్తుత నీటిమట్టం 884.30 అడుగులు. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఏంసీలుకాగా ప్రస్తుతం 211.47 టీఎంసీలుగా నమోదయినట్లు అధికారులు తెలిపారు.