మెదక్ అర్బన్, ఆగస్టు 10 : మెదక్ జిల్లా మెదక్- బొడ్మట్పల్లి రోడ్డుపై కొత్తపల్లి శివారులో నిర్మాణం చేసిన బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా కొత్తపల్లి శివారులో బీఆర్ఎస్ హయాంలో నిర్మిచిన బ్రిడ్జిని ఆమె పరిశీలించి మాట్లాడారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ హయాంలో రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేశారన్నారు. కేసీఆర్ కృషితో రూ. 1.40 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేసినా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీటీ రోడ్డు నిర్మాణం చేయడం లేదన్నారు.
వర్షాలు పడిన సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు మరమ్మతులు చేయాలని వాహనదారులు పలుమార్లు కోరినా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు.బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆమె వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కొడపాక సర్పంచ్ కాశీనాథ్రావు, నాయకులు బద్రి మల్లేశం, సోములు, దుర్గయ్య, అనిల్రెడ్డి, బాబాగౌడ్, పలువురు నాయకులు ఉన్నారు.
మెదక్ జిల్లాలోని రాజిపేట, గాజిరెడ్డిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆమె వారికి భరోసా కల్పించారు.