మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఓ ప్రభుత్వ దవాఖానలో ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మచిలీపట్నంలోని (Machilipatnam) సర్వజన ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లల విభాగంలో 15 మంది చికిత్స పొందుతున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి వారికి ఇంజెక్షన్ చేశారు.
అయితే అర గంట తర్వాత చిన్నారులకు విపరీతమైన చలి జ్వరం, వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన డాక్టర్లు ఏడుగురిని ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.