అమరావతి : స్కూల్ బస్ డ్రైవర్(School Bus ) నిర్లక్ష్యం వల్ల పెను ప్రమాదం తప్పింది. సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సును నడపడం వల్ల బస్ బోల్తా పడి విద్యార్థులు (Students) గాయపడిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట పమిడిమర్రు వద్ద చోటు చేసుకుంది. 66 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు పమిడిమర్రు వద్ద ఒక్కసారిగా బోల్తా పడింది.
బస్సులో ఉన్న విద్యార్థులు కేకలు, అరుపులు వేయడంతో స్థానికులు వచ్చి విద్యార్థులకు సురక్షితంగా బయటకు తీశారు. వీరిలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు కాగా మరో విద్యార్థి కాలికి తీవ్ర గాయం అయ్యింది. గాయపడ్డ విద్యార్థులను నరసరావుపేట ప్రైవేట్ ఆస్పత్రి (Private Hospital)కి తరలించి చికిత్స అందజేస్తున్నారు. బస్సు డ్రైవర్ సెల్ఫోన్(Cell phone) మాట్లాడుతూ నడపడమే ప్రమాదానికి కారణమని జిల్లా విద్యాశాఖాధికారి శ్యాముల్ వెల్లడించారు.