అమరావతి : ఎంతో ఉత్సాహంగా స్వాతంత్య్ర వేడుకల్లో (Independence day) పాల్గొని ఇంటికి వెళ్తున్న విద్యార్థుల స్కూల్ బస్ (School Bus) బోల్తా పడడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థ మంగళవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. సమీపంలోని గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులను స్కూల్ బస్సులో తీసుకొచ్చి వేడుకల అనంతరం ఇంటి వద్ద డ్రాప్ చేసేందుకు బయలు దేరారు.
కూచిపూడి-పెద్దపూడి గ్రామాల మార్గమధ్యలో మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా బస్సు బోల్తా (Over turn) పడడంతో బస్సులో ఉన్న 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి ( Injured) . వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో విద్యార్థులను 108 వాహనంలో తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.