తిరుమల : గుంటూరు కు చెందిన వంగా హేమలత అనే భక్తురాలు శుక్రవారం టీటీడీ కి రూ 30 లక్షల విరాళంగా అందించారు. తిరుమల క్యాంప్ కార్యాలయంలో తన కుమారుడు శ్రీకాంత్ తో కలసి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి డిడిని అందించారు. ఈ మొత్తం టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ కు ఉపయోగించుకోవాలని దాత కోరారు. కాగా నిన్న తిరుమలలోని శ్రీవారిని 82,722 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,678 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.5.11 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.