అమరావతి : అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. జిల్లాలోని పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి చెక్పోస్ట్ వద్ద ద్విచక్రవాహనాన్ని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు దలవాయిపల్లికి చెందిన శంకరనారాయణ(19), హుస్సేన్(15) గా పోలీసులు గుర్తించారు. బాలు అనే యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని రాజంపేట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.