అమరావతి : తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో దేవరపల్లి హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) లో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దేవరపల్లి మండలం బంధపురం వద్ద జాతీయరహదారి (National Highway) పై ఓ కారుది ముందరి టైరు పేలింది. దీంతో ఆ కారు కంట్రోల్ తప్పి డివైడర్ పైనుంచి అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. అప్పుడే అటు వైపు నుంచి వేగంగా వస్తున్న మరో కారును కారును ఢీ కొట్టింది . రెండు కార్లు ఓవర్ స్పీర్తో ఉన్నందున బలంగా ఢీకోనడంతో నుజ్జు నుజ్జు అయ్యాయి. స్పాట్లో రెండు కార్లలో చిన్నారితో పాటు మరో ఇద్దరు మహిళలు ముగ్గురు చనిపోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడ్డ వారిని గోపాలపురం, దేవరపల్లి, కొవ్వూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆ మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యేకళా వెంకట్రావు ప్రమాదం గమనించి పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.