అమరావతి : దైవదర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road accident) లో తండ్రి, కూతురు దుర్మరణం పాలైన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది . ఓ కుటుంబంలోని దంపతులు, కుమార్తెతో కలిసి విజయవాడ దుర్గమ్మ (Durgamma) దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కలపర్రు టోల్గేట్ (Tollgate) వద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం డివైడర్ను బలంగా ఢీ కొన్నది . ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా మారింది . స్థానికులు హుటాహుటినా ఆమెను ఏలూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు . పోలీసులు కేసు (Police Case) నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.