తిరుమల : తిరుమల (Tirumala ) లో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రెండు కంపార్టుమెంట్లు మాత్రమే నిండాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం( Sarvadarsan) కలుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 61,135 మంది భక్తులు దర్శించుకోగా 19,004 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీ హుండీ ఆదాయం (Hundi Income) రూ. 3.78 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన పీఠాధిపతి
యాదుగిరి యతిరాజ మఠం ప్రధాన పీఠాధిపతి నారాయణ రామానుజ జీయర్ మేల్కోటే బుధవారం తెల్లవారుజామున వేంకటేశ్వర స్వామి దర్శించుకుని ప్రార్థనలు చేశారు. శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు డీవైఈవో హరిద్రనాథ్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గర్భాలయానికి తీసుకెళ్లారు.