Tirumala | కలియుగ వైకుంఠం తిరుమలలో (Tirumala) రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం వాహనసేవతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఉదయం 5:30 గంటలకు శ్రీవారు సూర్యప్రభ వాహనం (Suryaprabha vahanam)పై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఈ వాహనసేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారి వాహనసేవలు రాత్రి వరకూ కొనసాగనున్నాయి.
ఉదయం 11 గంటల ప్రాంతంలో చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 గంట తర్వాత గరుడ వాహనం, మధ్యాహ్నం 2- 3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు. మరోవైపు రథసప్తమి వేడుకల సందర్భంగా తిరుమల ఆలయాన్ని తితిదే అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రకరకాల పువ్వులతో ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.
Also Read..
Rakul preet singh | రకుల్ ఇంట పెళ్లి సందడి షురూ.. ఘనంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా రథసప్తమి వేడుకలు
Soul Of Satya | ఫ్రాన్స్ ఫిలిం ఫెస్టివల్లో సత్తాచాటిన సాయిధరమ్ తేజ్ ‘సోల్ ఆఫ్ సత్య’