అమరావతి : కళాశాలల్లో ర్యాగింగ్ను అరికట్టేందుకు ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాగాని కొన్ని కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్ను బయట ప్రపంచానికి తెలియకుండా యాజమాన్యాలు వాటిని తొక్కిపెట్టేస్తున్నాయి.. ఓ విద్యార్థి జాతీయ కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదుతో గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.
గుంటూరు కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి సీనియర్లు వేధింపులకు గురిచేశారు. కళాశాలలో పొడుగు చేతుల చొక్కానే వేసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆమె జాతీయ మెడికల్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. స్పందించిన కమిషన్ ఫిర్యాదు చేసిన విద్యార్థి వివరాలు గోప్యంగా ఉంచుతూ గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ను వివరణ కోరింది. వెంటనే కళాశాల ప్రిన్సిపల్ సీనియర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వివరాలు రాబట్టారు. నివేదికను కమిషన్కు పంపనున్నట్లు సమాచారం.