గుడివాడ : (Kodali Nani) రాష్ట్రంలో జనసేన అనే పార్టీ ఏనాడో చచ్చిపోయిందని, అలాంటి పార్టీ మాకు డెడ్లైన్లు పెట్టడం ఏంటని పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పెట్టే డెడ్లైన్లు ప్రధాని మోదీకి పెడితే రాష్ట్రానికన్నా లాభం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడలోని తన నివాసంలో మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసింది జనసేన పొత్తు పెట్టుకున్న బీజేపీ అని తెలిసి కూడా ఆయన మాకు డెడ్ లైన్లు పెట్టడంలో ఆంతర్యంమేంటో ఆయనకే తెలియాలన్నారు.
జానీ వంటి పాత సినిమాల్లోని డైలాగ్లు వల్లె వేస్తూ మమ్మల్ని భయపెట్టాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారని, ఆ సినిమాలేవో మోదీకి చూపి భయపెట్టించాలని నాని సూచించారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్, చంద్రబాబులకు భయపడే వ్యక్తులు, శక్తులు ఎవరూ లేరని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో పవన్ కల్యాణ్కు ఎట్టకేలకు జ్ఞానోదయం కలగడం సంతోషకరమని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో పాల్గొనేందుకు ముందుకొచ్చిన ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.
ప్రభుత్వ దవాఖానల్లో డ్రస్ కోడ్.. మండిపడుతున్న వైద్యులు
అందరికీ అందుబాటులో న్యాయం ఉండాలి: ఉపరాష్ట్రపతి
టీడీపీ గుర్తింపును రద్దు చేయండి : వైసీపీ
చక్కెర తినడం వల్లనే డయాబెటిస్ వస్తుందా? ఇవీ నిజాలు.. తెలుసుకోండి!
వ్యక్తి హింసిస్తున్న కుక్కను కాపాడిన ఆవు! వీడియో వైరల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..