తిరుమల : దేశవ్యాప్త జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమలలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఈ కార్యక్రమం ” జరుగనుంది. తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీవారి ఆలయంతో కలిపి 21ప్రాంతాల్లో భక్తులకు, స్థానికులకు నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో భక్తులు, స్థానికులు ఐదు సంవత్సరాల లోపు వయసు ఉన్న చిన్నారులకు విధిగా పల్స్పోలియో చుక్కలు వేయించుకోవాలని సిఎంవో డాక్టర్ నర్మద కోరారు.