అమరావతి: రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది. ఇన్నర్ రింగు రోడ్డు మాస్టర్ ప్లాన్లో అవకతవకలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబర్ 1కి వాయిదా వేసింది.
మరోవైపు అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ పిటిషన్పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణను ఏపీ ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.