అమరావతి, జూన్ 10:కాంట్రాక్టు నర్సుల బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలని జగన్ సర్కారు ను ఏపీ హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని కోరింది. రెమిడెసివర్ ఇంజెక్షన్ల వినియోగ కాలపరిమితిని ఏడాదికి పెంచుతూ డీసీఐ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కరోనా వేళ మానసిక రోగులకు ఎలాంటి వైద్యచికిత్సలు అందిస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. మెంటల్ హెల్త్ యాక్టును ఏ విధంగా అమలు చేస్తారని హైకోర్టు ఆరా తీసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలపై విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.