అమరావతి : తిరుమలలో(Tirumala) మరోసారి చిరుతపులి సంచారం(Leopards roamed) కలకలం రేపింది. అలిపిరి నడక దారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసి భక్తులు (Devotees) భయంతో గట్టిగా కేకలు వేయడంతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. భక్తులను విడివిడిగా కాకుండా గుంపులుగా పంపిస్తున్నారు.
చిరుత జాడలను గుర్తించేందుకు అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. కాగా, ఇటీవలే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో(Ghat Road) చిరుత సంచరించింది. బుధవారం తెల్లవారుజామున భక్తుల(Devotees) కారుకు చిరుత అడ్డు వచ్చింది. ఈ దృశ్యాలు సీసీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. గతంలో కూడా ఇదే ప్రదేశంలో చిరుత పులులు పలుమార్లు కనిపించడం గమనార్హం.