అమరావతి : ఎన్టీయే కూటమికి ఆశీర్వాదం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) ఏపీ ప్రజలకు ట్వీట్(Tweet) ద్వారా కోరారు. మరికొద్ది నిమిషాల్లోనే ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో జరుగనున్న ప్రజాగళం బహిరంగ సభకు బయలు దేరిన సందర్భంగా మోదీ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
చంద్రబాబు, పవన్తో కలిసి సభలో ప్రసంగిస్తున్నానని, ఏపీ ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్డీయే కోరుకుంటుందని , ఎన్టీయే(NDA) కు మద్దతు ఇస్తే రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళతామని వెల్లడించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరుగుతున్నందున మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 2024 ఎన్నికలకు కూటమిగా ఏర్పడ్డ తరువాత ముగ్గురు ఒకే వేదికపై ప్రసంగించడం పది సంవత్సరాలు అనంతరం ఇదే తొలిసారి.