Nara Lokesh | తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) కుటుంబసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్కు భారీ విరాళం అందించారు. కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకొని తిరుమలలో ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు రూ.38 లక్షలను టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్కు లోకేశ్ విరాళంగా ఇచ్చారు.
దేవాన్ష్ జన్మదినం సందర్భంగా నారా భువనేశ్వరితో కలిసి లోకేశ్- బ్రాహ్మణి దంపతులు గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నదానం చేశారు. ఉదయం శ్రీవారి భక్తులకు అల్పాహారం వడ్డించారు. ఈ సందర్భంగా రూ.38 లక్షలను తితిదే అన్నప్రసాదం ట్రస్ట్కు విరాళంగా ఇచ్చారు.
Also Read..
Jaggi Vasudev | సద్గురు ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చిన ఆయన కూతురు
PM Modi | రష్యా – ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి భారత్ పూర్తి మద్దతు : ప్రధాని మోదీ
Bengaluru | బెడ్రూమ్ కిటికీ తెరిచి ఉంచుతున్నారంటూ.. పొరుగింటి జంటపై మహిళ ఫిర్యాదు