అమరావతి : విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతిమణి నారా భువనేశ్వరం అన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె తొలిసారిగా స్పందించారు.నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన అందరికీ ధన్యవాదాలు .. నాకు జరిగిన అవమానం మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్లు భావించారు…
మీరంతా నాకు అండగా నిలబడడాన్ని జీవితంలో మర్చిపోలేను.చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో పెంచారని ఆమె స్పష్టం చేశారు.ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరూ వ్యవహరించ కూడదని, నాకు జరిగిన అవమానం మరొకరికి జరగకూడదని ఆమె పేర్కొన్నారు.