Mudragada | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీట్ కేటాయింపుపై ఎటువంటి అవగాహనా ఒప్పందం లేకుండానే ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలుస్తున్నది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు పట్ల కినుక వహించినందు వల్లే ముద్ర గడ పద్మనాభం అధికార పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.
పవన్ కల్యాణ్ తనను రెండు దఫాలు కలుస్తానని కబురు చేసి, తర్వాత మొహం చాటేయం పట్ల ముద్రగడ పద్మనాభం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది. జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ తీరు సరిగా లేదని ముద్రగడ భావిస్తున్నట్లు సమాచారం.