గుంటూరు: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) వైసీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఏపీ సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతోపాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం కృషి చేస్తానని ముద్రగడ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కన్నబాబు, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు చిత్తురు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.
కాగా, ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరుతారనే విషయమై ఏపీలో తీవ్రంగా చర్చజరిగిన విషయం తెలిసిందే. అయితే చివరకు ఆయన జగన్ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. ముద్రగడ.. 1978లో జనతా పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అందులో చేరారు. ఉమ్మడి ఏపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @ysjagan సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి… pic.twitter.com/8HrShBHGR0
— YSR Congress Party (@YSRCParty) March 15, 2024
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @ysjagan సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి
2011, 2017లో ఈస్ట్ రాయలసీమ నుంచి రెండుసార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీనివాసులు రెడ్డి
— YSR Congress Party (@YSRCParty) March 15, 2024