అమరావతి : రైలులో తిరుపతికి వెళ్లిన భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ (Krishna Express ) రైలులో పొగలు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ నుంచి బయలు దేరిన రైలు ఏపీలోని వెంకటగిరి స్టేషన్ (Venkatagiri Station) సమీపంలో పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగింది.
సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అప్రమత్తమై పరిశీలించడంతో ఏసీ కోచ్ బోగీ బ్రేకులు పట్టేయడం తో పొగలు వచ్చాయని గుర్తించి మరమ్మతులు చేశారు. అనంతరం రైలును అక్కడి నుంచి తిరుపతికి పంపించారు. సుమారు అరగంట పాటు రైలును నిలపడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.