(Kodali Nani on Babu) అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి నిప్పులు చెరిగారు. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని, బ్లాక్ మార్కెట్లో దొంగ వ్యాపారం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ఏదో అద్భతమైన పనులు జరిగాయని చెప్పుకుంటున్నారని.. వాటిలో ఆయన ప్రమేయం ఉందని తేల్చితే రాజకీయాలను వదిలేస్తానని ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు ఒక వైరస్లాంటోడని మండిపడ్డారు. జగన్ సీఎం కావడం రాష్ట్రం అదృష్టమని కొనియాడారు.
నిత్యావసరా ధరలపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని, అయితే బయటి మార్కెట్ కంటే హెరిటేజ్లోనే అధిక ధరలకు వస్తువులు అమ్ముతున్నారని ఆరోపించారు. హెరిటేజ్, ప్రియా కంపెనీలు బయట వాటికంటే 30 శాతం అధిక ధరలకు వస్తువులు అమ్ముతున్న విషయం అందరికీ తెల్సునన్నారు. బ్లాక్ మార్కెట్లో దొంగ వ్యాపారం చేసే చంద్రబాబు.. సీఎం జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ ఎయిర్పోర్టు, రింగ్ రోడ్డు నిర్మాణాలతో చంద్రబాబుకు ఎలాంటి సంబందం లేదని, వీటిలో చంద్రబాబు ప్రమేయం ఉన్నదని నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానన్నారు. రాష్ట్రానికి పట్టిన వైరస్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. జగన్ ఏపీకి సీఎంగా రావడం రాష్ట్రం చేసుకున్న అదృష్టమని చెప్పారు.
ఆర్జీవీ కామెంట్లపై కౌంటర్..
దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్లపై మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఆయనకు నేను తెలియాలనేంద లేదని, ఇందులో ఆశ్చర్యం ఏమీ అక్కర్లేదన్నారు. ఏపీ రాష్ట్రం ఉన్నదని, దానికి ఒక సీఎం ఉన్నారని ఇన్ని రోజులు వరకూ వాళ్లకు తెలియలేదు, ఇప్పుడిప్పుడే తెలుస్తుందని, ఇంక నా గురించి వాళ్ళకేం తెలుస్తుంది.. అంటూ కౌంటర్ విసిరారు.
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
రిలాక్స్ కోసం కాఫీ తాగుతున్నారా? ఒక్క క్షణం ఆలోచించండి
ప్రతినెలా రూ.1500 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. 35 లక్షలు…
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..