Earthquake: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో విశాఖపట్నంలోని స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
తెల్లవారుజామున 4.18 గంటలకు ఆరిలోవ, అడవివరం, 4.16 గంటలకు మాధవధార, మురలీ నగర్, రాంనగర్, అక్కయ్యపాలెం, హెచ్బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తిలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. భీమిలి బీచ్ రోడ్, పెందుర్తి, సింహాచలంలో పెద్ద శబ్దంతో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.