అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడితే 20 రెట్లు బదులు తీర్చుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. చిత్తూరు జిల్లా దేవరాజుపురం రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
కార్యకర్తపై పడే ప్రతి దెబ్బ నాకు తగిలినట్లుగా భావిస్తా.నని తెలిపారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే తాను పర్యటిస్తున్నానని స్పష్టం చేశారు. కొందరు తాను కుప్పంను వదిలిపెడతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కుప్పంను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. టీడీపీకి చెందిన కొందరు నాయకులు పార్టీలు మారినా కార్యకర్తలు పార్టీ వెంటే ఉండడం అభినందనీయమని బాబు వెల్లడించారు..