అమరావతి : విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. కళాశాలకు వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీకొన్న సంఘటనలో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందింది. విశాఖలోని సత్యం కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సింథ్యా సమంతానియా అనే విద్యార్థిని మృతి చెందింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. లారీ యజమని, డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రికి చేరుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.