అమ్రాబాద్, ఆగస్టు 5 : నల్లమల ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనులకు అభివృద్ధి ఫలాలు పూర్తిస్థాయిలో అందాలే చూడాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా అమ్రాబాద్ మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. విష్ణుగిరిలో గిరిజన సంక్షేమంపై అధికారులతో ఆయన సమీక్షించి, చెం చుల హక్కుల పరిరక్షణతోపాటు జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభు త్వం చేపడుతున్న కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలని ఆదేశించారు.
అనంతరం బ్రహ్మగిరి ఉన్నత పాఠశాల, మల్లయ్యపెంటను సందర్శించి గిరిజన విద్యార్థులతో మాట్లాడారు. వారికి అందుతున్న భోజనం, వసతి, విద్యాసౌకర్యాలను పరిశీలించారు. చెంచుగిరిజనులతో ముఖాముఖి నిర్వహించి.. ఉపాధి అవకాశాలు, పిల్లల విద్య, విద్యుత్తు, గృహసదుపాయం, పెన్షన్ తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వటవర్లపల్లి పీహెచ్సీని సందర్శించి అటవీ ప్రాంతాల నుంచి రోగులను తరలించే విధానాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
కల్వకుర్తి, ఆగస్టు 5 : ఆర్టీసీలో పల్లె వెలుగు బస్సులను ఎక్స్ప్రెస్ బస్సులుగా నడిపిస్తుండటంతో కార్మికులపై పెరుగుతున్న పనిభారం తగ్గించాలని కోరుతూ నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ డిపో ఎదుట బుధవారం టీఎంయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకుడు రవీందర్ మాట్లాడుతూ కాలం చెల్లిన బస్సులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికుల సమస్యలపై డీఎం, ఉన్నతాధికారులకు వినతులు అందజేస్తున్నా స్పందన లేదని, మేనేజ్మెంట్ స్పందించకుంటే రిలే దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.