Kurnool Bus Fire | కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బైక్ను ఢీకొని మంటలు అంటుకోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఈ ప్రమాదంలో మరింత ప్రాణ నష్టం కాకుండా ఉండటంలో ఇద్దరు తమవంతుగా సాయం చేశారు. వారిలో ఓ మహిళ బస్సు ప్రమాదం గురించి కర్నూలు ఎస్పీకి సమాచారం అందించగా.. అంబులెన్స్ కోసం చూడకుండా బస్సులో నుంచి బయటపడిన వారిని తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడారు.
పుట్టపర్తి దర్శనానికి వెళ్లి హైదరాబాద్ తిరిగొస్తున్న క్రమంలో కర్నూలు వద్ద జరిగిన బస్సు యాక్సిడెంట్ను హైమ చూశారు. ఆమె దగ్గరకు వెళ్లే సరికి బస్సు మంటల్లో తగులబడుతుంది. బస్సులో నుంచి అద్దాలు పగులకొట్టుకుని బయటకు దూకేసిన పలువురు తమ వారిని తలచుకుంటూ రోదిస్తు ఉన్నారు. అయితే అప్పటికీ పోలీసులు కానీ.. ఫైర్ సిబ్బంది కానీ ఎవరూ అక్కడకు రాలేదు. దీంతో వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. తన కాంటాక్ట్స్లో కర్నూలు ఎస్పీ నంబర్ ఉండటంతో ఆయనకు కాల్ చేసి ప్రమాద తీవ్రతను వివరించింది. అలాగే ప్రమాదానికి సంబంధించిన వీడియోను పంపించింది. దీంతో ప్రమాద తీవ్రతను గుర్తించిన కర్నూలు ఎస్పీ.. రూరల్ సీఐ, ఇతర పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆ తర్వాత కాసేపటికే పోలీసు సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. అప్పటికే ఓ వ్యక్తి ఆరుగురిని ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తరలించగా.. పోలీసు సిబ్బంది ఐదుగురిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.
She was a witness to the Kurnool bus accident, and after hearing her speak, my heart sank. I realized how inhumane people have become — instead of helping or calling the police, many stood there recording videos.
pic.twitter.com/3GZO1RDu6w— sunanda🇮🇳 (@Boppana_Sunanda) October 24, 2025
హిందూపురం నుంచి నంద్యాలకు తన సోదరుడిని కలిసేందుకు వెళ్తున్న ఓ యువకుడు ఈ బస్సు ప్రమాదాన్ని గమనించాడు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో బస్సులోని ఎవరినీ కాపాడే పరిస్థితి లేకుండా ఉంది. అదే సమయంలో కొంతమంది బస్సు అద్దాలను పగులకొట్టుకుని బయటకు వచ్చారు. బస్సులో నుంచి దూకడంతో వాళ్ల తలలకు, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన ఆ యువకుడు అంబులెన్స్ వచ్చేదాకా చూడకుండా తన కారులో ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. దీంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇలా ప్రమాద సమయంలో తమవంతు సాయం చేసిన వీరిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆ ఇద్దరితో పాటు ఆపదలో ఆదుకున్న ప్రతి ఒక్కరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
బస్సు ప్రమాదం ఎలా జరిగిందో చెప్పిన ప్రత్యక్ష సాక్షి..
హిందూపూర్ నుంచి నంద్యాల వెళ్తుండగా బస్సులో మంటలు చెలరేగడం చూశాను
రమేష్ అనే వ్యక్తి బస్సు అద్దాలు పగులకొట్టి వచ్చాడు
ఆరుగురిని రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లాను
– ప్రత్యక్ష సాక్షి https://t.co/mohou6wJ5X pic.twitter.com/4jTR22vSpF
— BIG TV Breaking News (@bigtvtelugu) October 24, 2025