Srisailam | శ్రీశైలం బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వైద్యశాలకు కామినేని ఆస్పత్రి ఎండీ శశిధర్ అంబులెన్స్ను విరాళంగా అందించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వెంటిలేటర్తో పాటు ఉన్న రూ.50 లక్షల విలువ జేసే అంబులెన్స్ను విరాళంగా అందజేశారు. ఆలయ గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఈవో డి.పెద్దిరాజుకు కామినేని యాజమాన్య సభ్యుడు అంబులెన్స్ను అందజేశారు. అనంతరం అంబులెన్స్ దాతకు ఈవో పెద్దిరాజు శ్రీస్వామి అమ్మవార్ల ప్రసాదాలు, ఫొటో జ్ఞాపకంగా అందజేశారు.