తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లోని నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ స్కీమ్లో 2021-22 సంవత్సరానికి గాను కేటగిరి -1,2 పరిశీలకులుగా పనిచేసేందుకు నాలాయిర దివ్యప్రబంధం చదివినవారు అర్హులు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవైష్ణవ బ్రాహ్మణుల నుంచి రెండోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన వారు నెలవారీ సంభావన ప్రాతిపదికన శ్రీవైష్ణవ ఆలయాల్లో నాలాయిర దివ్యప్రబంధం పారాయణం చేయాల్సి ఉంటుంది.
పూర్తి చేసిన దరఖాస్తులను2022,జనవరి 25వ తేదీ సాయంత్రం5గంటల లోపు“ప్రత్యేకాధికారి వారి కార్యాలయం, నాలాయిర దివ్యప్రబంధ పారాయణ స్కీమ్, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్వేత భవనం, తిరుపతి-517502” చిరునామాకు పంపాల్సి ఉంటుంది. మొదటి సారి దరఖాస్తు చేసిన వారు తిరిగి పంపాల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు 0877-2264519 నంబర్ లో కార్యాలయ వేళల్లో సంప్రదించాల్సి సంప్రదించాల్సి ఉంటుంది. www.tirumala.org వెబ్సైట్ నుంచి దరఖాస్తులు పొందవచ్చు.