అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9లక్షల 14వేల 423 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వృత్తి విద్య పరీక్షలను 87,435 మంది రాయనున్నారు. రాష్ట్రంలో 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి.
పరీక్ష కేంద్రాలు ఉన్న మార్గాల్లో రెగ్యులర్ సర్వీసులు ఏవీ రద్దు చేయకుండా నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని జిల్లా అధికారులను ఆదేశించారు.