తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవుదినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు ( Compartments) నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,852 మంది భక్తులు దర్శించుకోగా 31,277 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3 16 కోట్లు వచ్చిందన్నారు.
Also read :