తిరుమల, : ఇటీవల జరిగిన మహిళా క్రికెట్ వరల్డ్ కప్లో భారత్ జట్టు ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర వహించిన కడప జిల్లాకు చెందిన భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి (Indian cricketer Sricharani ) తిరుమలలో ( Tirumala ) శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ( Chairman ) ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా చైర్మన్ ఆమెను శాలువతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో భవిష్యత్తులో క్రికెట్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పాల్గొని శ్రీచరణికి అభినందనలు తెలిపారు.