తిరుపతి:పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఈనెల19వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన మైదానంలో కార్తీక దీపోత్సవం పెద్దఎత్తున నిర్వహించనున్నారు.సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్నఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
నవంబరు 22వ తేదీన బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో, నవంబర్ 29వ తేదీన విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో ఉన్న ఎంజీఎం మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.