అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో ప్రభుత్వ నోటిఫికేషన్ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇంటర్ పరీక్షల్లో జంగ్లింగ్ విధానం ప్రవేశపెడుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. పాత విధానంలోనే ప్రాక్టికల్స్ నిర్వహించాలని స్పష్టం చేసింది. కళాశాలల్లోనే ప్రాక్టికల్స్ పరీక్షలు జరుపాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరుగనున్నాయి.
గతంలో విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు నిర్వహించాల్సి ఉంది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు మార్చి 11 నుంచి మార్చి 31వరకు జరుగుతాయని నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్లను పరీక్షలకు సిద్ధం చేశారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి సురేశ్ వెల్లడించారు.