అమరావతి : ఉచిత ఇసుక వ్యవహారంలో ఏపీ సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) వేసిన కేసుపై ఏపీ హైకోర్టు (High Court r) తీర్పును రిజర్వ్లో ఉంచింది . ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక పంపిణీలో అవతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ( AP CID) కేసు నమోదుచేసింది. ఈ కేసులో తనను అరెస్టు చేయవద్దంటూ ముందస్తు బెయిల్కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్వేశారు. పలు దఫలుగా కేసును విచారించిన కోర్టు బుధవారం మరోసారి విచారించింది.
చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించగా సీఐడీ తరుపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇసుక అక్రమాలపై ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండిపడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచ్చల విడిగా ఇసుక తవ్వకాలు జరిపారని ఆరోపించారు.