అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుగ్రామాలు ముంపునకు గురయ్యాయి. పరిస్థితులను చక్కదిద్ధేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలకు చెరువులకు వరద పోటెత్తుతోంది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్పురంలోని గులూరు చెరువు వరద పోటెత్తడంతో పొంగి ప్రవహిస్తోంది. పలుచోట్ల వరదల్లో చిక్కుకున్న జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.