అమరావతి: ఆంధ్రప్రదేశ్ని మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. ఈ నెల 16 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనిప్రభావంతో రాష్ట్రంలో నవంబర్ 18 నుంచి వర్షాలు కురువనున్నాయని పేర్కొన్నది. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
కాగా, ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉయదగిరి, కావలి, గూడూరు నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షం పడుతున్నాయి.