అమరావతి : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీ (APS RTC) గుడ్న్యూస్ తెలిపింది. పండుగకు హైదరాబాద్ (Hyderabad ) నుంచి ఏపీలోని సొంత గ్రామాలకు వెళ్లడానికి ప్రత్యేక బస్సులు (Special buses) నడిపేందుకు చర్యలు చేపట్టింది.
రెగ్యులర్గా నడిచే సర్విసులతో పాటు 2,400 బస్సులను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజన్ ఎల్. విజయలక్ష్మి తెలిపారు. ప్రత్యేక బస్సులు జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధారణ చార్జీలతోనే ఈ బస్సులు బయలుదేరుతాయని తెలిపారు.
ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి లేదా అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల నుంచి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని వివరించారు. ఎంజీబీఎస్లో ప్రయాణికులు, బస్సుల రద్దీ దృష్ట్యా జనవరి 10 నుంచి 12 వరకు కర్నూలు, చిత్తూరు, నెల్లూరు. అనంతపురం, మాచర్ల, ఒంగోలు వైపు వెళ్లే రెగ్యులర్, ప్రత్యేక బస్సులను గౌలిగూడ సీబీఎస్ నుంచి నడుపుతారని తెలిపారు.