అమరావతి : ఏపీలోని కొన్ని ప్రతిపక్షాలు దేవున్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. దేశీయ ఆవు నెయ్యి తయారీ కేంద్రం నిర్మాణానికి టీటీడీ ఈవో కెయస్ జవాహర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గోఆధారిత పదార్థాలతో తయారు చేయించిన నైవేద్యం ప్రారంభించి ఏడాది పూర్తికావస్తుందని, ఈ కార్యక్రమానికి భక్తుల సహకారంతో విజయవంతంగా కొనసాగుతుందని చెప్పారు.
మూడు కోట్ల రూపాయల భక్తుల విరాళాలతో స్వామివారికి కైంకర్యం, దీపారాధన కోసం దేశవాళీ ఆవు పాలతో పదార్థాల తయారి శ్రీవారి సేవలో అందుబాటులో ఉంటాయని అన్నారు. తిరుపతిలో భక్తుల తోపులాటపై స్పందించిన ఆయన స్వామివారిని దర్శించుకునేందుకు గాను ఒకేసారి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తోపులాట జరిగిందని అన్నారు .
ఘటన జరిగిన గంటలోపే టోకెన్లు లేకుండానే భక్తులను అనుమతించామని వివరించారు. భక్తులు భయాందోళనకు గురి చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు . నడకదారి భక్తులకు దివ్యదర్శనాన్ని త్వరలో ప్రారంభించనున్నామని వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.