హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కాకినాడ జిల్లా తాళ్లరేవు మం డలం గోపులంక వద్ద గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు శనివారం గల్లం తు కాగా, ఆదివారం ఉదయం మృతదేహాలను వెలికితీశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని సజ్జాపురానికి చెందిన ఏడుగురు యువకులు మూడు బైక్లపై శనివారం గోపులంక పుష్కరఘాట్కు చేరుకున్నారు.
పుట్టినరోజున స్నేహితులతో కలిసి విహారానికి వచ్చిన హనుమకొండ కార్తీక్ (21) ముందుగా గోదావరిలో స్నానానికి దిగాడు. నీటిలో మునిగిపోతుండగా కాపాడేందుకు మద్దెన గణేశ్ (21), పెండ్యాల బాలాజీ (21), తిరుమలరావు రవితేజ (21) గోదావరిలోకి దిగారు. వీరు కూడా కొట్టుకుపోతుండటంతో సలాది దుర్గా మహేశ్, కొమ్మిరెడ్డి చైతన్య నదిలోకి దిగారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెనక్కి వచ్చేశారు. వీరితోపాటు వచ్చిన మరో యువకుడు నేదూరు భానుప్రసాద్ భయాందోళనకు గురై.. అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయాడు.