అమరావతి : ఏపీలో మరోసారి కరోనా కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారుల వివరాల ప్రకారం.. జూన్ 26 నుండి జూలై 16 మధ్య కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నంలో 1, కాకినాడలో 1 కేసు నమోదయ్యాయి.
అలాగే దేశవ్యాప్తంగా ఈ నెల 339 కేసులు నమోదవ్వగా అత్యధికంగా కేరళలో 115 కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్, నికోబార్లో 8, ఢిల్లీలో 18, రాజస్థాన్లో 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.