కోనసీమ: ఆంధ్రప్రదేశ్లోని (Andhra pradesh) అంబేద్కర్ కోనసీమ (Konaseema) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆలమూరు మండలం మడికి వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు.. టాటా మ్యాజిక్ వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుల్లో వ్యాన్లో ఉన్న ముగ్గురు, కారులో ఉన్న మరొకరు ఉన్నారని పోలీసులు తెలిపారు.
శనిదోశ నివారణ కోసం రంపచోడవరానికి చెందిన పది మంది కొత్తపేట మండలం మందపల్లిలోని ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది చెప్పారు. కారు విశాఖపట్నం నుంచి భీమవరం వెళ్తున్నదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.