Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో యాత్రికుల అవసరాల మేరకు పలు కీలక అభివృద్ది పనులకు బుధవారం శంకుస్థాపన చేస్తామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. బుధవారం ఉదయం 11:21 గంటలకు సుమారు రూ.215 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ది పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
దేవస్థానం పరిధిలో భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు గంగాధర మండపం వద్ద సన్నాహాలు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు.