అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జరిగిన అగ్నిప్రమాద (Fire Incident) ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. వీరిలో అగ్నిమాపక అధికారులుశ్రీనివాస్రెడ్డి, కృష్ణారెడ్డి సహా పలువురికి గాయాలయ్యాయి. దుగ్గిరాలలో ఉన్న శుభం మహేశ్వరీ కోల్డ్ స్టోరేజ్ (Cold Storage) లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాద సంబవించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం విషయం తెలియగానే ఐదు అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేందుకు విశ్వప్రయత్నాలు చేశాయి.
గోదాం తలుపు వద్ద ఒక్కసారిగా మంటలు రావడంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఫైర్ సిబ్బంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది (Fire Staff) మంటల కారణంగా గోదాము లోపలకు వెళ్లే అవకాశం లేక మంటల నియంత్రణ కష్టంగా మారింది. శనివారం మధ్యాహ్నం వరకు కూడా మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.ఈ ఘటనలో మొత్తం 11 మంది గాయపడ్డారు. గోదాంలో దాచుకున్న సరుకు కాలి బుడిత కావడంతో రైతులు(Farmers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.